Surprise Me!

మేమిలా చేసి ఉంటే 3నెలలకే చంద్రబాబు జైల్లో ఉండేవారు | Sajjala Ramakrishna Reddy | Asianet News Telugu

2025-05-31 623 Dailymotion

ఆంధ్రప్రదేశ్ లో రెడ్‌బుక్ పాలన పరాకాష్టకు చేరిందని, ఏడాది పాలనకే కూటమి ప్రభుత్వానికి ప్రజలు పాడెకట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సెంట్రల్ జైల్ లో మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులను బనాయించి వైయస్ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక అరాచక పాలనను సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే గత ప్రభుత్వంలో మేం కూడా చేసి ఉంటే చంద్రబాబు మూడునెలలకే జైలుకు వెళ్ళేవారన్నారు. అధికారం ఉందని ఇప్పుడు నమోదు చేస్తున్న అక్రమకేసుల పర్యవసానాలు తరువాత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. <br /><br />#sajjalaramakrishnareddy #kakanigovardhanreddy #ysrcp #chandrababu #nellorepolitics #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon